యూపీ బీహార్ లు శ్రావణమాసం, మహాశివరాత్రి సందర్భాలలో ప్రత్యేకంగా నిర్వహించే కావడి యాత్ర సోమవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగు బస్తి నుండి హెచ్ఎంటి శివాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ గారు హాజరై కావడి ని మోసి బిహారీ భక్తులకు శ్రావణమాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ గారు మాట్లాడుతూ పవిత్ర శ్రావణమాసంలో బిహారీలు పవిత్ర గంగాజలంతో శివునికి అభిషేకం చేయడం ద్వారా వారి మొక్కులను తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ అన్ని ప్రాంతాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు నిలయంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ధర్మేందర్, మంజుల, జగదీష్ పాల్, రమేష్, రాజ్ కుమార్, సంతోష్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

యూపీ బీహార్ సోదరులు నిర్వహించే కావడి యాత్రలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ గారు
యూపీ బీహార్ లు శ్రావణమాసం, మహాశివరాత్రి సందర్భాలలో ప్రత్యేకంగా నిర్వహించే కావడి యాత్ర సోమవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగు బస్తి నుండి హెచ్ఎంటి శివాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ గారు హాజరై కావడి ని మోసి బిహారీ భక్తులకు శ్రావణమాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ గారు మాట్లాడుతూ పవిత్ర శ్రావణమాసంలో బిహారీలు పవిత్ర గంగాజలంతో శివునికి అభిషేకం చేయడం ద్వారా వారి మొక్కులను తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ అన్ని ప్రాంతాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు నిలయంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ధర్మేందర్, మంజుల, జగదీష్ పాల్, రమేష్, రాజ్ కుమార్, సంతోష్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

