మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన కార్మికులతో నిండిన పికప్ వాహనాన్ని ఓ ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రక్ టైరు పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రక్ మరో ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన కార్మికులతో నిండిన పికప్ వాహనాన్ని ఓ ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రక్ టైరు పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రక్ మరో ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

