ముత్తుకూరు మండలంలో వాల్టా చట్టానికి విరుద్ధంగా భూగర్భ జలాల అక్రమ వినియోగం జరుగుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులు పవన్ కుమార్ ప్రజాపతి ఆరోపించారు. డీ-బోర్ల ద్వారా అధికంగా నీటిని తోడటంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని తెలిపారు. మరోవైపు అధిక భారీవాహనాల రాకపోకలతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. నీటి కొరతపై మండల అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని పవన్ కుమార్ ప్రజాపతి డిమాండ్ చేశారు

భూగర్భ జలాల దోపిడీతో ముత్తుకూరులో నీటి సంక్షోభం
ముత్తుకూరు మండలంలో వాల్టా చట్టానికి విరుద్ధంగా భూగర్భ జలాల అక్రమ వినియోగం జరుగుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులు పవన్ కుమార్ ప్రజాపతి ఆరోపించారు. డీ-బోర్ల ద్వారా అధికంగా నీటిని తోడటంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని తెలిపారు. మరోవైపు అధిక భారీవాహనాల రాకపోకలతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. నీటి కొరతపై మండల అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని పవన్ కుమార్ ప్రజాపతి డిమాండ్ చేశారు

