Wednesday, 16 September 2026

Tag: punnami

భక్తి

గణనాథుడి ఆశీస్సులతో కొత్త వెలుగులు

వినాయక చవితి అనేది కేవలం పండుగ కాదు… మన ఆలోచనలకు దిశనిచ్చే ఆధ్యాత్మిక ఆరంభం. శ్రీ గణనాథుడి కరుణతో ప్రతి కుటుంబంలో ఆనందం, ప్రతి హృదయంలో నమ్మకం, ప్రతి ప్రయత్నంలో పురోగతి నిండాలని కోరుకుంటున్నాం. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, మంచి నిర్ణయాలకు జ్ఞానం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే సంకల్పం కలగాలి. భక్తి, బంధం, బాధ్యత, సానుకూలతలతో ఈ పండుగ మరింత అర్థవంతంగా మారాలి. మన ఇళ్లలో నవ్వులు, మనసుల్లో శాంతి, పనుల్లో విజయం, సమాజంలో సౌహార్దం పెరగాలని ఆకాంక్షిస్తూ పున్నమి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భూగర్భ జలాల దోపిడీతో ముత్తుకూరులో నీటి సంక్షోభం

ముత్తుకూరు మండలంలో వాల్టా చట్టానికి విరుద్ధంగా భూగర్భ జలాల అక్రమ వినియోగం జరుగుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులు పవన్ కుమార్ ప్రజాపతి ఆరోపించారు. డీ-బోర్ల ద్వారా అధికంగా నీటిని తోడటంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని తెలిపారు. మరోవైపు అధిక భారీవాహనాల రాకపోకలతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. నీటి కొరతపై మండల అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని పవన్ కుమార్ ప్రజాపతి డిమాండ్ చేశారు

తూర్పు గోదావరి

సింగంపల్లిలో రూ.2.20 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం

రంగంపేట, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి): రంగంపేట మండలం సింగంపల్లిలో రూ.2.20 కోట్లతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైద్యరంగంలో గణనీయమైన సంస్కరణలు చేపట్టి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే 65 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చామని, దీంతో సామాన్యులు ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేస్తున్నామని తెలిపారు. అనపర్తి వంద పడకల ఆసుపత్రి, పెదపూడి సీహెచ్‌సీతో పాటు నియోజకవర్గంలోని పీహెచ్‌సీలను బలోపేతం చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద రోగులకు పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, కాకినాడ, రాజమహేంద్రవరం జీజీహెచ్‌లను కూడా బలోపేతం చేసి అధునాతన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారుల రంగాల్లో సంస్కరణలు చేపట్టి సుపరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, రంగంపేట మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, సింగంపల్లి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Blog

జీవిత బీమా ఎందుకు అవసరం?

కుటుంబానికి మనం అందించే ఆదాయం ఆగిపోయినా, వారి జీవితం ఆర్థికంగా ఆగిపోకూడదు. లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోని మరణం సంభవించినప్పుడు పాలసీ నిబంధనల ప్రకారం కుటుంబానికి ఆర్థిక రక్షణ అందిస్తుంది. ఇంటి ఖర్చులు, పిల్లల చదువు, రుణాల చెల్లింపులు, భవిష్యత్ లక్ష్యాలను కొనసాగించేందుకు బీమా మొత్తం సహాయపడుతుంది. ముఖ్యంగా కుటుంబ ఆదాయంపై ఆధారపడిన వారికి తగిన జీవిత బీమా కవరేజ్ అవసరం. చిన్న వయసులోనే సరైన పాలసీని ఎంచుకోవడం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలో కీలకమైన అడుగు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.