ఆలూరు మండల కేంద్రానికి చెందిన కాచర్ల మోహన్ ఇటీవల దుబాయిలో మరణించడం బాధాకరమని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. శనివారం ఆయన ఆలూరు మండల కేంద్రంలో బాధిత కుటుంబ సభ్యులను వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన కాచర్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ ఈ మధ్యన మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు వినోద్, దినేష్, ఇమ్రాన్, సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు.



