అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చేయూతనందించింది. చిట్వేల్ మండలం మైలపల్లి పంచాయతీ రాచపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను బుధవారం వారి నివాసాల వద్ద అందజేశారు.
రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి సిఫారసుతో రాఘవ నాగరాజుకు రూ.40,360, చొక్కరాజు సుబ్బలక్ష్మమ్మకు రూ.23,600 విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవడం సీఎం సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారం మధ్య సీఎంఆర్ఎఫ్ ద్వారా అందిన సాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపశమనాన్ని కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి, ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ కమిటీ ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అభినందించారు.

బాధిత కుటుంబాలకు భరోసా.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చేయూతనందించింది. చిట్వేల్ మండలం మైలపల్లి పంచాయతీ రాచపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను బుధవారం వారి నివాసాల వద్ద అందజేశారు. రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి సిఫారసుతో రాఘవ నాగరాజుకు రూ.40,360, చొక్కరాజు సుబ్బలక్ష్మమ్మకు రూ.23,600 విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవడం సీఎం సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారం మధ్య సీఎంఆర్ఎఫ్ ద్వారా అందిన సాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపశమనాన్ని కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి, ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ కమిటీ ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అభినందించారు.

