Tuesday, 1 September 2026
  • Home  
  • బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది కూచాడి శ్రీహరిరావు
- నిర్మల్

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది కూచాడి శ్రీహరిరావు

నిర్మల్, సెప్టెంబర్ 1: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన నర్సయ్య వేములకుర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎల్‌ఓసీ పత్రాన్ని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరిరావు అందజేశారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం బాధిత కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల సహాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని కూచాడి శ్రీహరిరావు బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం విషయంలో ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని కూచాడి శ్రీహరిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్కల్ మాజీ ఎంపీటీసీ లింగన్న, అనంతపేట్ సర్పంచ్ తిరుమల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్, సెప్టెంబర్ 1: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన నర్సయ్య వేములకుర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎల్‌ఓసీ పత్రాన్ని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరిరావు అందజేశారు.
చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం బాధిత కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల సహాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని కూచాడి శ్రీహరిరావు బాధిత కుటుంబానికి అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం విషయంలో ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని కూచాడి శ్రీహరిరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొన్కల్ మాజీ ఎంపీటీసీ లింగన్న, అనంతపేట్ సర్పంచ్ తిరుమల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.