ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే , వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన టీడీపీ మాజీ ఇంచార్జ్ ఉక్కు ప్రవీణ్..
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎవరు లేరనుకుంటున్నావా? పార్టీ కోసం , పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం నేనున్నా..
నేనుండగా టీడీపీ నాయకులను, కార్యకర్తలను తగిలి చూడు ఏం జరుగుతుందో!
టీడీపీ నాయకులు నిజాలు చెబితే జీర్ణించుకోలేని స్థితిలో రాచమల్లు ఉన్నారంటూ ధ్వజమెత్తారు..
దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ నాయకులు, కార్యకర్తల జోలికి రావాలని సవాల్..
చల్లా రాజగోపాల్పై రాచమల్లు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఉక్కు ప్రవీణ్..
ప్రొద్దుటూరులో బీసీ నాయకులంటే రాచమల్లుకు గిట్టదని, రమేష్ యాదవ్ను ఎంత ఇబ్బంది పెట్టావో ప్రజలకు తెలుసని మండిపాటు..
నీ వద్ద ఉన్న కొందరిని లోపాయికారీ ఒప్పందం చేసుకుని టీడీపీలోకి పంపావని తీవ్ర ఆరోపణ..
వ్యక్తిగత దూషణలు మాని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు..
వైకాపా హయాంలో ప్రొద్దుటూరు వ్యాపారవేత్తలు, వర్తకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్న ప్రవీణ్..
“సమయం చెప్పు.. రాజగోపాల్తో కలిసి నీ ఇంటికే వస్తా.. నాలుక కోస్తావో లేదో చూస్తాం”


