ప్రజల స్వరమే నా వార్త – గంగపట్ల దేవదాస్
కలిగిరి: పున్నమి తెలుగు దినపత్రిక కలిగిరి రిపోర్టర్ గంగపట్ల దేవదాస్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే వారధిగా నిలవడమే తన ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పున్నమి ప్రతినిధుల నెట్వర్క్ను బలోపేతం చేసి, ప్రజలకు వేగవంతమైన, విశ్వసనీయమైన వార్తలను అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
మండల, నియోజకవర్గ ఇంచార్జ్లతో సమన్వయంగా పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తానన్నారు. భవిష్యత్తులో కలిగిరి ఇంచార్జ్గా ఎదిగి, పున్నమి తెలుగు దినపత్రిక అభివృద్ధికి తన వంతు సేవలందిస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యతాయుత పాత్రికేయుడిగా గుర్తింపు పొందడమే తన ప్రధాన లక్ష్యమని గంగపట్ల దేవదాస్ తెలిపారు.


