ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, భూసారం పరిరక్షించుకోవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు.
ప్రకాశం జిల్లా దొడ్డవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న వివిధ ప్రయోగాలను ఆయన క్షేత్రస్దాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ, దొడ్డవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ఎంతో బాగా చేస్తున్నారన్నారు. ఎన్నో నూతన ప్రయోగాలు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు.
ముఖ్యంగా రెండు ప్రయోగాలు ఎంతో వినూత్నంగా ఉన్నాయన్నారు. రెండున్నర ఎకరాల పొలంలో 29 లక్షల రూపాయల వ్యయంతో ఎన్నో పంటలను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారని తెలిపారు. అలాగే, వరిలో కలుపు నివారణకు నూకలన వినియోగించి మంచిఫలితాలు రాబట్టారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుత ఎల్ నినో పరిస్దితుల నేపథ్యంలో నీటిని సమర్దంగా వినియోగించుకోవాలన్నారు. వృధా భూములలో పశుగ్రాసం సాగుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.








