Tuesday, 8 September 2026
  • Home  
  • నాయుడు తోటలో.. మానసిక ఆరోగ్యం పై అవగాహన
- విశాఖపట్నం

నాయుడు తోటలో.. మానసిక ఆరోగ్యం పై అవగాహన

ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, పూజారులకు సెన్సిటైజేషన్ కార్యక్రమం విశాఖపట్నం, సెప్టెంబర్ 8 (పున్నమి ప్రతినిధి): వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో, లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ సహకారంతో నాయుడుతోటలో మానసిక ఆరోగ్యంపై అవగాహన, సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, దేవాలయ పూజారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు సహా సుమారు 50 మంది పాల్గొన్నారు. సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం, లక్షణాలను అర్థం చేసుకోవడం, బాధితులకు అవసరమైన సహాయం అందించడం, మెరుగైన చికిత్స కోసం సంబంధిత వైద్య సేవలకు అనుసంధానం చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. మానసిక ఆరోగ్య సమస్యలపై ఉన్న అపోహలు, భయాలు, వివక్షను తగ్గించడంలో కమ్యూనిటీ స్థాయిలో పనిచేసే సిబ్బంది కీలక పాత్ర పోషించాలని నిర్వాహకులు తెలిపారు. వాసవ్య మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎం. అబ్రహాం, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమ మాట్లాడుతూ వివిధ రకాల మానసిక ఆరోగ్య సమస్యలు, వాటి లక్షణాలు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు, బాధితులకు కుటుంబం–సమాజం అందించాల్సిన సహకారంపై వివరించారు. అలాగే వాసవ్య మహిళా మండలి నిర్వహిస్తున్న సాంత్వన (Santwana) కార్యక్రమం ద్వారా అందిస్తున్న మానసిక ఆరోగ్య అవగాహన, కౌన్సెలింగ్, ఇతర సహాయక సేవలను వివరించారు. మానసిక ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన వైద్య, మానసిక సహాయ సేవలకు అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయుడుతోట మెడికల్ ఆఫీసర్, హెల్త్ ఆఫీసర్, వాసవ్య మహిళా మండలి సిబ్బంది కృష్ణ, కుమారి, ప్రియాంక, మల్లేశ్వరి, లిఖిత తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, పూజారులకు సెన్సిటైజేషన్ కార్యక్రమం

విశాఖపట్నం, సెప్టెంబర్ 8 (పున్నమి ప్రతినిధి):
వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో, లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ సహకారంతో నాయుడుతోటలో మానసిక ఆరోగ్యంపై అవగాహన, సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, దేవాలయ పూజారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు సహా సుమారు 50 మంది పాల్గొన్నారు.

సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం, లక్షణాలను అర్థం చేసుకోవడం, బాధితులకు అవసరమైన సహాయం అందించడం, మెరుగైన చికిత్స కోసం సంబంధిత వైద్య సేవలకు అనుసంధానం చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. మానసిక ఆరోగ్య సమస్యలపై ఉన్న అపోహలు, భయాలు, వివక్షను తగ్గించడంలో కమ్యూనిటీ స్థాయిలో పనిచేసే సిబ్బంది కీలక పాత్ర పోషించాలని నిర్వాహకులు తెలిపారు.

వాసవ్య మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎం. అబ్రహాం, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమ మాట్లాడుతూ వివిధ రకాల మానసిక ఆరోగ్య సమస్యలు, వాటి లక్షణాలు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు, బాధితులకు కుటుంబం–సమాజం అందించాల్సిన సహకారంపై వివరించారు. అలాగే వాసవ్య మహిళా మండలి నిర్వహిస్తున్న సాంత్వన (Santwana) కార్యక్రమం ద్వారా అందిస్తున్న మానసిక ఆరోగ్య అవగాహన, కౌన్సెలింగ్, ఇతర సహాయక సేవలను వివరించారు.

మానసిక ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన వైద్య, మానసిక సహాయ సేవలకు అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమంలో నాయుడుతోట మెడికల్ ఆఫీసర్, హెల్త్ ఆఫీసర్, వాసవ్య మహిళా మండలి సిబ్బంది కృష్ణ, కుమారి, ప్రియాంక, మల్లేశ్వరి, లిఖిత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.