తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో ఊరి చివర ఉన్న 16 ఎకరాల నడుం చెరువులో గత 20 రోజులుగా పెద్దఎత్తున మట్టి తరలింపు జరుగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రెండు నుంచి మూడు జేసీబీలు, సుమారు పది టిప్పర్ వాహనాలతో చెరువు నుంచి మట్టిని బయటకు తరలిస్తున్నారని చెబుతున్నారు. చెరువు పరిసర ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి, అక్రమాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Uploaded Video:



