అనకాపల్లి పున్నమి ప్రతినిధి (ఆనంద్ )
దాడి వీరునాయుడు కళాశాలలో సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ బే ఆఫ్ బెంగాల్, ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓసియన్ లిట్రసి అవేర్నెస్ ప్రోగ్రాం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ INCOIS శాస్త్రవేత్త డాక్టర్ స్నేహజా గారు విచ్చేసి విద్యార్థులకు సముద్రం మానవాళిపై చూపే ప్రభావము మరియు సముద్రం మీద మనకంటూ ఉన్న ప్రభావం గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సముద్రం మన వాతావరణాన్ని, జీవనాధారాన్ని ఎలా నియంత్రిస్తుందో తెలియజేశారు. మానవులు చేసే కార్యకలాపాలు సముద్రం యొక్క ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు. సముద్ర వనరులను మానవాళికి ఎలా ఉపయోగించుకోవాలో ఎలా కాపాడుకోవాలో ఈ అవగాహన కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కోరుబిల్లి రమేష్, వైస్ ప్రిన్సిపల్ ఎస్ దయా మాధురి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.


