*కాగజ్ నగర్*: ఆగస్టు 13-రాజీవ్ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ మీదుగా మార్కెట్ ఏరియాలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.
*సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు వారి బ్యాండ్, కోలాటాలు మరియు నినాదాలతో హోరెత్తించారు*
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ యువతను దారి మళ్ళించేందుకు,స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు కొన్ని జాతి వ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.*
*సామూహిక వందేమాతర గీతాలాపనతో మొదలైన ఈ కార్యక్రమం సామూహిక జన గణ మన గీతాలాపనతో ముగిసింది.*
ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, కౌన్సిలర్లు విశ్వేశ్వరరావు, గజ్జెల లావణ్య, చిప్పకుర్తి శ్రీనివాస్, నాయకులు అరుణ్ లోయ, శివా గౌడ్, వీరభద్ర చారి, దెబ్బటి శ్రీనివాస్, సిందం శ్రీనివాస్, పుల్ల అశోక్, చిలువేరు ప్రవీణ్, సాయి చరణ్, మనోహర్ గౌడ్, రెహన్, అతిక్, సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయులు, కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.




