ఓటర్ల నోటీసులపై సబ్ కలెక్టర్కు ఫిర్యాదు..
కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో బీఎల్ వోలు ఓటర్లకు నోటీసులు అందించకుండా సచివాలయానికి వచ్చి తీసుకెళ్లాలని చెబుతున్నారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పూల భాస్కర్ సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రెడ్డివారి వీధిలో బీఎల్ ఓటర్లతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తామని, నోటీసులకు రిప్లైలు సేకరిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. కొత్త ఓటర్లను ఫారం-6 ద్వారా నమోదు చేస్తామని తెలిపారు.


