టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, సెప్టెంబర్ 1:
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యులు శ్రీ వర్ల రామయ్య గారిని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మంగళవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ వర్ల రామయ్య గారిని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శాలువాతో ఘనంగా సత్కరించారు. మైలవరం ప్రాంత ప్రత్యేకతను ప్రతిబింబించే ప్రసిద్ధ కొండపల్లి బొమ్మను జ్ఞాపికగా అందజేశారు.
ఈ సందర్భంగా వర్ల రామయ్య గారు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారితో పాటు మైలవరం నియోజకవర్గ టీడీపీ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. పార్టీ కోసం సీనియర్ నాయకులు చేస్తున్న సేవలను కొనియాడుతూ, వారి మార్గదర్శకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం.
Uploaded Video:


