ఉమ్మయ్యదేవర మఠం రుద్రయ్యకు ‘సువర్ణ కంకణ’ సత్కారం
కర్నూలు శ్రీ గౌరీ శంకర స్వామి దేవాలయం మరియు తెలంగాణ ఆత్మకూరు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయాల అర్చకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ ఉమ్మయ్యదేవర మఠం రుద్రయ్య గారిని ‘సువర్ణ కంకణము’తో ఘనంగా సత్కరించారు. బెంగళూరులోని జె.పి. నగర్ పాయ్ కన్వెన్షన్ హాల్లో ‘విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ’ (హైదరాబాద్) ఆధ్వర్యంలో జరిగిన 19వ వైదిక జ్యోతిష్య మహాసభలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన జ్యోతిష్య రంగానికి చేసిన కృషికి గాను ఈ అవార్డును అందజేశారు. ICAS ప్రతినిధి శ్రీమతి గాయత్రీ దేవీ వాసుదేవ్ (బి.వి. రామన్ కుమార్తె), ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ పాలపర్తి శ్రీకాంత శర్మ, శ్రీ జొన్నలగడ్డ శ్రీనివాస రావు చేతుల మీదుగా రుద్రయ్య గారికి ఈ పురస్కారాన్ని బహూకరించారు. ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు








