ఇరాన్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు పురోగమిస్తున్నాయి. 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగిస్తూ అణు కార్యక్రమంపై చర్చలు జరపడానికి రెండు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.
హోర్ముజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులు మెరుగుపర్చడం, ఆర్థిక ఆంక్షల సడలింపు, చమురు ఎగుమతులపై పరిమితుల సవరణ వంటి అంశాలు చర్చల్లో ప్రాధాన్యత పొందాయి. అయితే ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం ఇంకా లభించలేదు.
ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే ఈ పరిణామాన్ని అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి స్థాపనకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.


