పరమేశ్వరుడికి అన్నంతో అన్నాభిషేకం
రైల్వే కోడూరు మేజర్ న్యూస్
రైల్వే కోడూరు స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బాలాలయంలో అన్నాభిషేకం దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నది
శివుడు అభిషేక ప్రియుడు. శివుని ఒక్కొక్క ద్రవ్యంతో అర్చిస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది. పంచభూతాలకు అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని పంచభూతాల శక్తితో ఆవిర్భవించినట్టు అన్నంతో అభిషేకిస్తే అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశయించబడతారు. చర్మ వ్యాధులు తొలగిపోతాయి. అధికారం ప్రాప్తి కలుగుతుంది మోక్షాన్ని పొందుతారు. పంచామృతాలతో అభిషేకించిన తరువాత మెత్తని అన్నంతో అభిషేకించి ,శాఖములతో అలంకరించి షోడశ ఉపచార పూజలు నిర్వహిస్తారు. పూజ అయిన పిదప ఆ అన్నమును ప్రసాదంగా మనము, మనఇంటి వారు ,పసుపక్షాదులకు పెట్టాలి. “అన్నం పరబ్రహ్మస్వరూపం” అనేది వేదనానుడి. మనలో శక్తి చైతన్య పరచడానికి పంచభూతాలను శక్తిని ఈ అన్నం కలిగి ఉంటుంది. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టి వారి యొక్క ఆయును పెంచిన వారికి సకల శుభాలు చేరిపోతాయి అందుకే ఎవరైనా అన్నం పెట్టినప్పుడు వారిని ఈ విధంగా ఆశీర్వదిస్తారు ” అన్నదాత సుఖీభవ”. అన్నాదానం చేసిన వారికి సకల శుభాలు చేకూరతాయి. సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరి సృష్టిలో ఉన్న ప్రతి జీవికి అన్నప్రదాయుని.


