సీఎం చంద్రబాబు సోమవారం ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు ప్రజావేదిక, క్యాడర్ సమావేశాల్లో పాల్గొంటారు
•అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేయగల సామర్థ్యం కలిగినవారని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
•సీఎం చంద్రబాబు ఆదేశాలతో కైకలూరు నియోజకవర్గంలోని 1,090 మంది రైతులకు చెందిన 2,879 ఎకరాలు 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించబడ్డాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు
•రాజమండ్రి ప్రమాదంలో గాయపడిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు
•”ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమం 14వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.74 లక్షల కుటుంబాలను, నేడు ఒక్కరోజే 3.53 లక్షల ఇళ్లను పార్టీ శ్రేణులు సందర్శించి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాయి
Uploaded Video:

