పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్లో కొనసాగుతున్న అవినీతి, అక్రమాలను కళ్లు ఉండి కూడా చూడలేని స్థితిలో కమీషనర్ సరస్వతి ఉన్నారని, ఏదో ఒక సాకుతో అక్రమార్కులకు కొమ్ముకాయడమే ఆమెకు పరిపాటిగా మారిపోయిందని రంగారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ మాజీ అధికార ప్రతినిధి, బాలాపూర్ ఇన్ఛార్జ్ బొర్ర రవిమాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే.నెం:272,273, 275,276,277,278,281లలో పాత తేదీల్లో అప్పటి గ్రామ పంచాయితీ మాజీ సర్పంచ్ సంతకాలతో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ వెంచర్పై చర్యలు తీసుకోవాల్సిం దిగా కమీషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి 4 నెలలు గడుస్తున్నా కమీషనర్ పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. వెంచర్లో కనీసం క్షేత్రస్థాయి పరిశీలన సైతం నిర్వహించకుండా ఇక్కడి బిల్డర్లు గతంలోనే వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పట్లో 10 శాతం భూమిని బిల్డర్లు గ్రామపంచాయితీకి మార్ట్యూగేట్ చేయడం జరిగిందని స్వయంగా కమీషనర్ చెప్తుండడాన్ని చూస్తుంటే బిల్డర్లతో ఆమె కుమ్మక్కైనట్లు స్పష్టం అవుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా కమీషనర్ స్పందించి ఈ అక్రమ వెంచర్పై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేనిపక్ష్యంలో ఆమెపై జిల్లా స్థాయి ఉన్నతాధికారు లకు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో రవిమాదిగ హెచ్చరించారు

అవినీతి అక్రమాలకు అడ్డాగా బడంగ్పేట్ కార్పొరేషన్ —-రంగారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ నేత బొర్ర రవిమాదిగ
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్లో కొనసాగుతున్న అవినీతి, అక్రమాలను కళ్లు ఉండి కూడా చూడలేని స్థితిలో కమీషనర్ సరస్వతి ఉన్నారని, ఏదో ఒక సాకుతో అక్రమార్కులకు కొమ్ముకాయడమే ఆమెకు పరిపాటిగా మారిపోయిందని రంగారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ మాజీ అధికార ప్రతినిధి, బాలాపూర్ ఇన్ఛార్జ్ బొర్ర రవిమాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే.నెం:272,273, 275,276,277,278,281లలో పాత తేదీల్లో అప్పటి గ్రామ పంచాయితీ మాజీ సర్పంచ్ సంతకాలతో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ వెంచర్పై చర్యలు తీసుకోవాల్సిం దిగా కమీషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి 4 నెలలు గడుస్తున్నా కమీషనర్ పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. వెంచర్లో కనీసం క్షేత్రస్థాయి పరిశీలన సైతం నిర్వహించకుండా ఇక్కడి బిల్డర్లు గతంలోనే వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పట్లో 10 శాతం భూమిని బిల్డర్లు గ్రామపంచాయితీకి మార్ట్యూగేట్ చేయడం జరిగిందని స్వయంగా కమీషనర్ చెప్తుండడాన్ని చూస్తుంటే బిల్డర్లతో ఆమె కుమ్మక్కైనట్లు స్పష్టం అవుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా కమీషనర్ స్పందించి ఈ అక్రమ వెంచర్పై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేనిపక్ష్యంలో ఆమెపై జిల్లా స్థాయి ఉన్నతాధికారు లకు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో రవిమాదిగ హెచ్చరించారు

