అటవీ శాఖ ఆధ్వర్యంలో అరకులోయ అల్లూరి సీతారామరాజు సి.బి.ఎస్.ఇ పబ్లిక్ స్కూల్ నందు మంగళవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవం (ఆగష్టు-12) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డ్ డైరెక్టర్ నాజ్ రిజ్వి, సైంటిస్ట్ డా C.R. మగేష్, అరకు FRO బొర్రా కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఏనుగుల సంరక్షణ విశిష్టతను, వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఏనుగుల వేషధారణ ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ సి.బి.ఎస్.ఇ పబ్లిక్ స్కూల్ సెక్రటరీ Bh.రామకృష్ణ రాజు, ట్రెజరర్ B.V.A.R రాజు(రవి), డైరెక్టర్ మనినాయర్, ప్రిన్సిపాల్ ప్రసాద్ చంద్ర, ఎ.ఓ.సుమంత్ రాజు, పీఆర్ఓ వర్మ, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు



