అరకులోయ రైల్వే స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం కారు, ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అరకులోయ నుంచి వస్తున్న ఆటో, బైక్ లు, అరకు సంతబయలు నుంచి వస్తున్న కారు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో ఆటో, బైక్ నుజ్జునుజ్జుకాగా, కారు రహదారి కిందకు బోల్తాపడింది. ఈ ఘటనలో మృతి చెందిన రమేష్(23) అనే వ్యక్తి డుంబ్రిగుడ మండలం, కొర్రాయి పంచాయితీ కొత్తవలస గ్రామస్తుడిగా గుర్తించారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Uploaded Video:


