

పొట్నూరు.గిరీష్ ఆలోచన భేష్ అని, శర్వాణి విద్యా సంస్థల వ్యవస్థాపకులు, విద్యావేక్త, అంధవరపు.సూరిబాబు అన్నారు. నరసన్నపేట స్థానిక శర్వాణి పాఠశాలలో రక్థధాన శిబిరాన్ని పొట్నూరు.గిరీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం అంధవరపు.సూరిబాబు ఒక ప్రకటనలో మాట్లాడుతూ పొట్నూరు.గిరీష్ సేవకు సంకేతమని, మానవత్వానికి ముద్రవేశారని, గిరీష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారంచుట్టి ప్రాణదాతగా నిలిచారన్నారు. ఈ రోజు ఆయన వ్యక్తిగత ఆనందం కాకుండా, సమాజానికి ఉపయోగపడే మహోత్సవంగా మలిచారని, మోక్ష బ్లడ్ బ్యాంక్ సహకారంతో, నరసన్నపేట శర్వాణి విద్యాలయం వేదికగా నిర్వహించిన ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో ఇరవై మందికి పైగా రక్తదాతలు పాల్గొని తమ సేవా భావాన్ని చాటుకున్నారన్నారు. గిరీష్ మాట్లాడుతూ మన శరీరంలో తిరిగి పునరుత్పత్తి అయ్యే రక్తపు చుక్కలతో, మరొకరి ప్రాణం నిలబెట్టడం కన్నా గొప్ప దానం ఇంకేముందని, అడిగిన వెంటనే, రక్తదాన శిబిరానికి అంగీకరించిన పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. ఈ కార్యక్రమంలో శర్వాణి పాఠశాల డైరెక్టర్ సాయి రాణి, రక్తదాతలు, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, గిరీష్ కుటుంబ సభ్యులు, మోక్ష బ్లడ్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

