పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 5 వాకాడు మండలం,
అందత్వ నివారణ ధ్యేయంగా గిరిజన వాడలో తద్వారా గిరిజన వాసులకు ఎంవి రావు ఫౌండేషన్ కంటి చూపు ప్రసాదిస్తుంది అని వాకాడు ఐసిడిఎస్ సూపర్వైజర్ బుజ్జమ్మ అన్నారు.
బుధవారం తిరుపతి జిల్లా వాకాడు మండలం ఎర్రగడ్డ పల్లె పంచాయతీ పరిధిలోని గెద్దలమెట్ట గిరిజన కాలనీలో ఎం.వి .రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరమును ఏర్పాటు చేశారు.
ఈ నేత్ర వైద్య శిబిరాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రారంభించారు.
గెద్దర్లమెట్ట గిరిజన కాలనీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని నేత్ర వైద్య నిపుణులు, కోట రమేష్ ఐ కేర్ డాక్టర్ రమేష్ నేత వైద్య పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు.
వారికి అత్యంత తక్కువ ధరకు కంటే అద్దాలు అందజేస్తామని అదేవిధంగా కంట్లో శుక్లాలు అన్నవారికి తిరుపతి వాసన ఐ కేర్ ద్వారా కంటే ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించి వారికి నెలకు సరిపడా కంటే మందులు ఉచితంగా అందజేస్తామని ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయుని రాచల్ కేజీయ, హాయ్ సిడిఎస్ సూపర్వైజర్ బుజ్జమ్మ,అంగన్వాడి టీచర్లు సులోచన, గ్రామస్తులు కంటి సమస్యలతో బాధపడే రోగులు పాల్గొన్నారు.


