గూడూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 6.70 కోట్ల సీఎం సహాయనిధి (CMRF) నిధులు అందించామని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 6 కోట్ల 70 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి అందించడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడు అనారోగ్యంతో అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారికి సీఎం ఆర్థిక సహాయ నిధి ఓ వరం లా ఉందని, గత వైసిపి ప్రభుత్వం లో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి ద్వారా ఏమి ఇవ్వలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలోనే ఆరు కోట్లకు పైగా సీఎం సహాయనిది గూడూరు నియోజకవర్గంలో అందించామని తెలిపారు…. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. ఈ సమావేశం ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, రహీం, పలు మండలాల నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

