రాజంపేటలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం..
కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలోని జెండామాని వీధిలో టీడీపీ నాయకులు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. టౌన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం నాయుడు, డాక్టర్ డి. నవీన్ కుమార్, క్లస్టర్ ఇన్చార్జ్ కరీం తదితరులు పాల్గొని రెండేళ్ల టీడీపీ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం, శ్రీశక్తి, ఆటో డ్రైవర్ల సేవ, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ వైద్యసేవలు, సీఎంఆర్ఎఫ్ తదితర పథకాలపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలు, సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు.


