అనకాపల్లి: పున్నమి ప్రతినిధి ఆనంద్ :
జీవీఎంసీ 83వ వార్డులోని భీమునిగుమ్మం రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద, రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేయనున్న రైల్ ఇంజన్ నమూనా పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ పాల్గొని జీవీఎంసీ అధికారులకు పలు సూచనలు చేశారు.
జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, 83వ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ మంగా ఈశ్వర్, వార్డు టీడీపీ అధ్యక్షుడు రామకృష్ణ, నూకాంబిక దేవస్థానం ధర్మకర్త పొలిమేర ఆనంద్, కోట్ని రామకృష్ణ, తలారి లక్ష్మీప్రసాద్, జిల్లా తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కాయల ప్రసన్న, షేక్ రియాజ్, బూత్ ఇంచార్జ్ సిమిటి రామకృష్ణ, బెల్లాన శ్రీనివాస్, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ భానుచంద్ అఖిల్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.


