పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
నాయకులందరూ పార్టీ సిద్దాంతాలు పాటించాలి.అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాలి.ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం,అడ్డరోడ్డు శ్రీ శ్రీనివాసా కళ్యాణ మండపంలో మాజీ శాసనసభ్యులు పాయకరావుపేట నియోజకవర్గం సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ కంబాల జోగులు గారి అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాల్గొన్న పెద్దలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా పరిపాలన ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారు.మన ప్రభుత్వ హయాంలో జగనన్న చేసిన అభివృద్ధి,ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్పుకోలేకపోయాము.అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రామ సచివాలయం వ్యవస్థ,రైతు భరోసా కేంద్రాలు,విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన రోడ్లు ఇప్పుడు మేమే చేశాం అని ప్రచారాలు చేసుకుంటున్నారు.
చంద్రబాబు అబద్ధాలతో అధికారం కట్టబెట్టుకున్నారు.
చేసింది గోరింత చెప్పుకోవడం కొండంత,సంక్షేమం శూన్యం చంద్రబాబు చేసిన మోసాలు గ్రామాల్లో చేరవేయాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు మన పార్టీ అభ్యర్థులు గెలవాలి,పార్టీకి తోడుగా ఉన్న ప్రతి కార్యకర్తలకు అండగా ఉంటాం అని అన్నారు.ఏ ఒక్క గ్రామంలో కూడా ఏకగ్రీవం అనే ప్రసక్తే ఉండకూడదని అన్నారు
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు,ఎంపీపీలు,మండల పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గం, మండలాల,వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, ఎంపీటీసీ లు,మాజీ సర్పంచ్ లు,వైఎస్సార్సీపీ కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….


