ఖమ్మం ఆగష్టు 5
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ‘సురక్ష కా తిరంగా–సైబర్ స్వతంత్ర తెలంగాణ’ అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో సైబర్ నేరాలు అధికమవుతున్నాయని తెలిపారు. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. నకిలీ లింకులు, యాప్లు, ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే అధికారిక హెల్ప్లైన్ను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



