బెల్లంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాల,కళాశాలకు మున్సిపల్ చైర్మన్ దావా స్వాతి రమేష్ విచ్చేసి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసిన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. కార్యక్రమం ప్రారంభంలో ప్రిన్సిపల్ ఎం .డి నీలు మున్సిపల్ చైర్మన్ స్వాతి రమేష్ కి పుష్ప గుఛ్చం అందించి ఆహ్వానం పలికారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ స్వాతి రమేష్ విద్యార్థినిలకు పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వాతి రమేష్ విద్యార్థినులకు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ నీలు పాఠశాల ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మున్సిపల్ చైర్మన్ స్వాతి రమేష్ కౌన్సిలర్స్ రాయమల్లు, నిజాం, వంశీ సభను అలంకరించిన కౌన్సిలర్స్ మైనార్టీ లీడర్స్ ప్రత్యేకత కృతజ్ఞత తెలిపారు.విద్యార్థినిలు అందరూ ఆనందంగా పుస్తకాలను స్వీకరించి బాగా చదివి మంచి ఫలితాలను సాధిస్తామని చెప్పారు.



