Sunday, 19 July 2026
  • Home  
  • రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత:
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత:

ఆత్మకూరు.జులై 18 పున్నమి ప్రతినిధి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) రాములు సూచించారు. ఆత్మకూరులోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు స్కూల్ బస్సుల డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవీఐ రాములు మాట్లాడుతూ, వాహనం నడిపే ప్రతి ఒక్కరూ వేగ పరిమితులను పాటించాలని, ట్రాఫిక్ సిగ్నళ్లను గౌరవించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటుబెల్ట్ వినియోగించాలని తెలిపారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి నిర్లక్ష్య చర్యలు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని హెచ్చరించారు. స్కూల్ బస్సుల డ్రైవర్లు విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. బస్సులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తూ విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ప్రతి డ్రైవర్‌పై ఉందన్నారు. విద్యార్థులు కూడా రహదారులు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరిగితేనే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ బస్సుల డ్రైవర్లు పాల్గొన్నారు.

ఆత్మకూరు.జులై 18 పున్నమి ప్రతినిధి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) రాములు సూచించారు. ఆత్మకూరులోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు స్కూల్ బస్సుల డ్రైవర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంవీఐ రాములు మాట్లాడుతూ, వాహనం నడిపే ప్రతి ఒక్కరూ వేగ పరిమితులను పాటించాలని, ట్రాఫిక్ సిగ్నళ్లను గౌరవించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటుబెల్ట్ వినియోగించాలని తెలిపారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి నిర్లక్ష్య చర్యలు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని హెచ్చరించారు.
స్కూల్ బస్సుల డ్రైవర్లు విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. బస్సులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తూ విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ప్రతి డ్రైవర్‌పై ఉందన్నారు.
విద్యార్థులు కూడా రహదారులు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరిగితేనే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ బస్సుల డ్రైవర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.