నందిగామ మార్కెట్ యార్డ్లో రేపు శనివారం సాయంత్రం హిందూ సమ్మేళనం నిర్వహించ నున్నట్లు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు తెలిపారు. ఈ సమ్మేళనానికి భారీ సంఖ్యలో హిందువులు హాజరై విజయవంతంచేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ నుదుట తిలకం ధరించి రావాలని కోరారు. ఈ మేరకు సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రీయబ్రాహ్మణ సంఘటన కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు, రాష్ట్ర మహిళా కార్యదర్శి నందిరాజు కల్పన, యువ నాయకుడు రాజా హనుమంతరావు మాట్లాడారు. హిందూ సమాజ ఐక్యతను చాటే విధంగా ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు శర్మ, మూర్తి, లక్ష్మి, కరుణ, జ్యోతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రేపు నందిగామలో హిందూ సమ్మేళనం
నందిగామ మార్కెట్ యార్డ్లో రేపు శనివారం సాయంత్రం హిందూ సమ్మేళనం నిర్వహించ నున్నట్లు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు తెలిపారు. ఈ సమ్మేళనానికి భారీ సంఖ్యలో హిందువులు హాజరై విజయవంతంచేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ నుదుట తిలకం ధరించి రావాలని కోరారు. ఈ మేరకు సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రీయబ్రాహ్మణ సంఘటన కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు, రాష్ట్ర మహిళా కార్యదర్శి నందిరాజు కల్పన, యువ నాయకుడు రాజా హనుమంతరావు మాట్లాడారు. హిందూ సమాజ ఐక్యతను చాటే విధంగా ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు శర్మ, మూర్తి, లక్ష్మి, కరుణ, జ్యోతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

