Tuesday, 8 September 2026
  • Home  
  • రెండో రోజు తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఘనంగా జరిగింది పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా
- ఎన్ టి ఆర్ జిల్లా

రెండో రోజు తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఘనంగా జరిగింది పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా

Eలీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. మంగళగిరి, సెప్టెంబర్‌ 8: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజు నిర్వహించిన ప్రతిష్టాత్మక లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సోమవారం ప్రారంభమైన ఈ కాంక్లేవ్‌ మంగళవారం రెండో రోజు జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేష్‌ గారితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలు, పార్లమెంట్‌ పరిశీలకులు, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులు ఈ కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల్లో నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించడం, పార్టీ–ప్రభుత్వ సమన్వయాన్ని బలోపేతం చేయడం, ప్రజలతో మరింతగా అనుసంధానం కావడం ప్రధాన లక్ష్యాలుగా కాంక్లేవ్‌ను నిర్వహించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్‌ భవన్‌లోని టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ–ప్రభుత్వ సమన్వయంపై దిశానిర్దేశం రెండు రోజుల పాటు నిర్వహించిన కాంక్లేవ్‌లో ప్రజాప్రతినిధుల పనితీరు, పార్టీ–ప్రభుత్వ సమన్వయం, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధానం, పార్టీ కేడర్‌తో సమన్వయం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడం వంటి కీలక అంశాలపై శిక్షణా తరగతులు, చర్చలు నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధానం, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించడం, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపైనా నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంక్లేవ్‌ రెండో రోజైన మంగళవారం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ అధినాయకత్వం సూచనలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ–ప్రభుత్వ సమన్వయం, ప్రజలతో మరింతగా మమేకమై పనిచేయాల్సిన విధానం తదితర అంశాలపై జరిగిన శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వసంత కృష్ణప్రసాదు గారు కాంక్లేవ్‌లో పార్టీ అధినాయకత్వం నుంచి పలు సూచనలు, మార్గదర్శకాలను స్వీకరించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రజాప్రతినిధుల పాత్రపై జరిగిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఈ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ ద్వారా పార్టీ నాయకత్వం, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి నాయకుల మధ్య మరింత సమన్వయం పెంచడంతో పాటు రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

Eలీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

మంగళగిరి, సెప్టెంబర్‌ 8:

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజు నిర్వహించిన ప్రతిష్టాత్మక లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సోమవారం ప్రారంభమైన ఈ కాంక్లేవ్‌ మంగళవారం రెండో రోజు జరిగింది.

పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేష్‌ గారితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలు, పార్లమెంట్‌ పరిశీలకులు, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులు ఈ కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల్లో నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించడం, పార్టీ–ప్రభుత్వ సమన్వయాన్ని బలోపేతం చేయడం, ప్రజలతో మరింతగా అనుసంధానం కావడం ప్రధాన లక్ష్యాలుగా కాంక్లేవ్‌ను నిర్వహించారు.

తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్‌ భవన్‌లోని టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పార్టీ–ప్రభుత్వ సమన్వయంపై దిశానిర్దేశం

రెండు రోజుల పాటు నిర్వహించిన కాంక్లేవ్‌లో ప్రజాప్రతినిధుల పనితీరు, పార్టీ–ప్రభుత్వ సమన్వయం, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధానం, పార్టీ కేడర్‌తో సమన్వయం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడం వంటి కీలక అంశాలపై శిక్షణా తరగతులు, చర్చలు నిర్వహించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధానం, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించడం, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపైనా నాయకులకు దిశానిర్దేశం చేశారు.

కాంక్లేవ్‌ రెండో రోజైన మంగళవారం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ అధినాయకత్వం సూచనలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ–ప్రభుత్వ సమన్వయం, ప్రజలతో మరింతగా మమేకమై పనిచేయాల్సిన విధానం తదితర అంశాలపై జరిగిన శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వసంత కృష్ణప్రసాదు గారు కాంక్లేవ్‌లో పార్టీ అధినాయకత్వం నుంచి పలు సూచనలు, మార్గదర్శకాలను స్వీకరించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రజాప్రతినిధుల పాత్రపై జరిగిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ ద్వారా పార్టీ నాయకత్వం, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి నాయకుల మధ్య మరింత సమన్వయం పెంచడంతో పాటు రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.