Wednesday, 10 June 2026
  • Home  
  • రక్షణ రంగ ఉద్యోగులు సేవలు అజరామరం*
- విశాఖపట్నం

రక్షణ రంగ ఉద్యోగులు సేవలు అజరామరం*

*రక్షణ రంగ ఉద్యోగులు సేవలు అజరామరం* *ఘనంగా డాక్ యార్డ్ ఉద్యోగుల వన సమారాధన* *సందడి చేసిన జబర్దస్త్ నటులు* *విశాఖపట్నం డిసెంబర్ 21 పున్నమి ప్రతినిధి* దేశ ప్రగతిలో రక్షణ రంగ ఉద్యోగులు అందించిన సేవలు అజరామరమని భీమిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నెయగాపుల జనార్దన్ రావు .. ప్రముఖ గైనకాలజిస్ట్ బొత్స లక్ష్మీ కొండమ్మ లు కొనియాడారు.. ఆదివారం ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపం ఆవరణలో డాక్ యార్డ్ ఉద్యోగుల కేటిబి అసోసియేషన్ వనసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరు మాట్లాడుతూ ఒకవైపు ఉద్యోగులు అంకితభావంతో తమ విధులు నిర్వహిస్తూనే మరోవైపు సమాజ సేవా కార్యక్రమాల్లో డాక్ యార్డ్ ఉద్యోగులు ఎంతోమందికి ఆదర్శప్రాయులుగా నిలిచారన్నారు.. అందరూ సమైక్యంగా ఉండి కోరుకున్న ప్రగతి సాధించుకోవాలన్నారు.. ఉద్యోగులు.. కుటుంబ సభ్యులు.. పిల్లలు ఇలా అంతా ఒకే చోట చేరి సందడిగా గడపడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందన్నారు.. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ అసోసియేషన్ లో సభ్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతిస్తూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.. సభ్యులు పిల్లలకు ఉపకార వేతనాలు .. అలాగే వైద్య.. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.. .అధ్యక్షులు బత్తుల చిరంజీవి కార్యదర్శి విజనగిరి భాస్కరరావు లు మాట్లాడుతూ అందరి సహకారంతోనే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వన సమారాధనలో సుమారు 900 మంది సభ్యులు వారి కుటుంబ సభ్యులు పాల్గొనగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. *సందడిచేసిన జబర్దస్త్ నటులు* డాక్ యార్డ్ ఉద్యోగుల వన సమారాధన కార్యక్రమంలో జబర్దస్త్ నటులు బుల్లెట్ భాస్కర్.. అప్పారావు.. అల్లరి నరేష్ తదితరులు సందడి చేశారు.. వీరు చేసిన కామెడీ స్కిట్లు ఆహుతు లను విశేషంగా అలరించాయి.. కళాకారులకు.. నటులకు.. అతిధిలను ఘనంగా సత్కరించి గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా జ్ఞాపికలు బహుకరించారు.

*రక్షణ రంగ ఉద్యోగులు సేవలు అజరామరం*

*ఘనంగా డాక్ యార్డ్ ఉద్యోగుల వన సమారాధన*

*సందడి చేసిన జబర్దస్త్ నటులు*
*విశాఖపట్నం డిసెంబర్ 21 పున్నమి ప్రతినిధి*

దేశ ప్రగతిలో రక్షణ రంగ ఉద్యోగులు అందించిన సేవలు
అజరామరమని భీమిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు
నెయగాపుల జనార్దన్ రావు .. ప్రముఖ గైనకాలజిస్ట్ బొత్స లక్ష్మీ కొండమ్మ లు కొనియాడారు.. ఆదివారం ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపం ఆవరణలో డాక్ యార్డ్ ఉద్యోగుల కేటిబి అసోసియేషన్
వనసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరు మాట్లాడుతూ ఒకవైపు ఉద్యోగులు
అంకితభావంతో తమ విధులు నిర్వహిస్తూనే మరోవైపు సమాజ సేవా కార్యక్రమాల్లో డాక్ యార్డ్ ఉద్యోగులు ఎంతోమందికి ఆదర్శప్రాయులుగా నిలిచారన్నారు.. అందరూ సమైక్యంగా ఉండి కోరుకున్న ప్రగతి సాధించుకోవాలన్నారు.. ఉద్యోగులు.. కుటుంబ సభ్యులు.. పిల్లలు ఇలా అంతా ఒకే చోట చేరి
సందడిగా గడపడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందన్నారు.. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు
మాట్లాడుతూ అసోసియేషన్ లో సభ్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతిస్తూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.. సభ్యులు పిల్లలకు ఉపకార వేతనాలు .. అలాగే వైద్య.. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు..
.అధ్యక్షులు బత్తుల చిరంజీవి కార్యదర్శి విజనగిరి భాస్కరరావు లు
మాట్లాడుతూ అందరి సహకారంతోనే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వన సమారాధనలో సుమారు 900 మంది సభ్యులు వారి కుటుంబ సభ్యులు పాల్గొనగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు..

*సందడిచేసిన జబర్దస్త్ నటులు*

డాక్ యార్డ్ ఉద్యోగుల వన సమారాధన కార్యక్రమంలో జబర్దస్త్ నటులు బుల్లెట్ భాస్కర్.. అప్పారావు.. అల్లరి నరేష్ తదితరులు సందడి చేశారు.. వీరు చేసిన కామెడీ స్కిట్లు ఆహుతు లను విశేషంగా అలరించాయి..
కళాకారులకు.. నటులకు.. అతిధిలను ఘనంగా సత్కరించి
గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా జ్ఞాపికలు బహుకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.