మన్నూరులో ఘనంగా వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ..
మన్నూరులో గ్రామంలో శ్రీశ్రీశ్రీ గోదా మహాలక్ష్మి శ్రీ ఐరావత వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయుడు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి కల్యాణాన్ని వీక్షించారు. వేద పండితులు బత్యాలను ఆశీర్వదించి శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


