బాసర ఆగస్టు 17(పున్నమి ప్రతినిధి )
నిర్మల్ జిల్లా బాసర మండల పరిషత్ కార్యాలయంలో, నూతనంగా ప్రజావాణి దరఖాస్తులను బాసర మండల ఎంపీడీవో మరియు తహసిల్దార్ వివిధ శాఖల అధికారులు కలిసి స్వీకరించారు, ప్రజల సమస్యల నుంచి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు.
అన్ని శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని, ఎమ్మార్వో పవన్ చంద్ర మరియు ఎంపీడీవో దేవేందర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల దృష్టికి దరఖాస్తు చేశారు, ప్రజావాణి కార్యక్రమంలోవివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



