ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కు నివాళులర్పించిన కలెక్టర్,
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
కారేపల్లి:
విద్యుత్ తీగలు తగిలి ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ మృతదేహానికి పలువురు ఉన్నత అధికారులు, నాయకులు నివాళులర్పించారు.సింగరేణి మండల పరిధిలోని వెంకిటియ తండాలో బుధవారం నవీన్ అంత్యక్రియలు జరిగాయి. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఎస్ తోపాటు అటవీశాఖ ఉన్నత అధికారులు, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం డిఎఫ్ఓ సిద్దార్ధ విక్రమ్ సింగ్ పలువురు ప్రజాప్రతినిధులు నవీన్ బౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం తరుపునా అండహా ఉంటామని తెలిపారు. నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కలెక్టర్ తో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. మృతుడు నవీన్ కు భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు.


