collector kakinada
ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారులు బాధ్యతతో స్పందించి సకాలంలో పరిష్కరించాలి..
పీజీఆర్ఎస్ కు 324 అర్జీలు..
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్
కాకినాడ, ఆగస్టు 24:
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి, అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వికాసమందిర్ హాల్లో జరిగింది.





