Tuesday, 15 July 2025
  • Home  
  • పర్యావరణాన్ని కాపాడు
- Featured

పర్యావరణాన్ని కాపాడు

తూర్పుగోదావరిజిల్లా అమలాపురం : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయం ఆవరణ లో ఆర్.డి. ఓ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల కాలుష్యాల వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతిని పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, ఇందుకు గాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఆర్.డి. ఓ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమనేది భాద్యతగా స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి. ఓ కార్యాలయం పరిపాలనాధికారి శ్రీనివాస్, కె .ఆర్. సి. తహసీల్దార్ జి. లక్ష్మీపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సత్తి నాగేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పుగోదావరిజిల్లా అమలాపురం :


పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం అమలాపురం ఆర్.డి. ఓ కార్యాలయం ఆవరణ లో ఆర్.డి. ఓ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల కాలుష్యాల వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతిని పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, ఇందుకు గాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఆర్.డి. ఓ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమనేది భాద్యతగా స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి. ఓ కార్యాలయం పరిపాలనాధికారి శ్రీనివాస్, కె .ఆర్. సి. తహసీల్దార్ జి. లక్ష్మీపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సత్తి నాగేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.