Monday, 14 September 2026
  • Home  
  • పరమేశ్వర కాలనీలో రూ.58 లక్షలతో నూతన సీసీ రోడ్ల మంజూరు. మధుయాష్కి గౌడ్, రవీందర్ గౌడ్‌లకు కాలనీ ప్రెసిడెంట్ సుంకరి వెంకన్న గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు
- రంగారెడ్డి

పరమేశ్వర కాలనీలో రూ.58 లక్షలతో నూతన సీసీ రోడ్ల మంజూరు. మధుయాష్కి గౌడ్, రవీందర్ గౌడ్‌లకు కాలనీ ప్రెసిడెంట్ సుంకరి వెంకన్న గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు

హయత్ నగర్ మండలం: హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీ డివిజన్‌లోని పరమేశ్వర కాలనీలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.58 లక్షల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో కాలనీలో మిగిలి ఉన్న మట్టి రోడ్ల స్థానంలో నూతన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. సీసీ రోడ్ల మంజూరుకు విశేషంగా కృషి చేసిన ఏఐసీసీ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్కు పరమేశ్వర కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కాలనీ అధ్యక్షులు సుంకరి వెంకన్న గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మంజూరు ప్రక్రియలో కాలనీ వాసులకు అండగా నిలిచి సహాయ సహకారాలు అందించిన హయత్‌నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు చెన్నగోని రవీందర్ గౌడ్కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ముద్దం పరమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అక్కి రమేష్, ఉపాధ్యక్షులు కాటేపల్లి ముత్యాలు గౌడ్, కోశాధికారి రాపోలు జ్ఞానేశ్వర్, జాయింట్ సెక్రటరీ ఆలకుంట్ల శ్రీధర్, గౌరవ సలహాదారులు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, పజ్జురు మోహన్ రెడ్డి, కంకణాల మల్లారెడ్డి, సన్నాయిల ప్రసాద్, కందాల చంద్రారెడ్డి, పరమేశ్వర కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

హయత్ నగర్ మండలం: హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీ డివిజన్‌లోని పరమేశ్వర కాలనీలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.58 లక్షల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో కాలనీలో మిగిలి ఉన్న మట్టి రోడ్ల స్థానంలో నూతన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. సీసీ రోడ్ల మంజూరుకు విశేషంగా కృషి చేసిన ఏఐసీసీ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్కు పరమేశ్వర కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కాలనీ అధ్యక్షులు సుంకరి వెంకన్న గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మంజూరు ప్రక్రియలో కాలనీ వాసులకు అండగా నిలిచి సహాయ సహకారాలు అందించిన హయత్‌నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు చెన్నగోని రవీందర్ గౌడ్కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ముద్దం పరమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అక్కి రమేష్, ఉపాధ్యక్షులు కాటేపల్లి ముత్యాలు గౌడ్, కోశాధికారి రాపోలు జ్ఞానేశ్వర్, జాయింట్ సెక్రటరీ ఆలకుంట్ల శ్రీధర్, గౌరవ సలహాదారులు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, పజ్జురు మోహన్ రెడ్డి, కంకణాల మల్లారెడ్డి, సన్నాయిల ప్రసాద్, కందాల చంద్రారెడ్డి, పరమేశ్వర కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.