*నాయుడుపేట, సెప్టెంబర్ 4 *
నాయుడుపేట పట్టణంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల మరియు టౌన్ నాయకులతో ముఖ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ *శ్రీ డి. కిరణ్ కుమార్* ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికలు మరియు మండల స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటి నుండే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేసి, నాయుడుపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు *కన్నంబాకం హరికృష్ణ*, జిల్లా కిసాన్ రైతు విభాగం అధ్యక్షులు *జోగి వినోద్*, నాయుడుపేట మండల అధ్యక్షులు *తోప్పాని రవి*, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీను, సుధాకర్, వెంకట రమణయ్య తదితరులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


