నర్సంపేట నియోజకవర్గంఖానాపురంమండలంధర్మారావుపేట గ్రామంలో ఈరోజు దివంగత మాజీ ఎమ్మెల్యే,ప్రజానాయకుడు స్వర్గీయ పెద్ది సుదర్శన్రెడ్డి గారి సంతాప సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాఆయనకుఘనంగానివాళులు అర్పిస్తూ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ది సుదర్శన్రెడ్డి గారి సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ ఉద్యమంతో పాటు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ది సుదర్శన్రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. ముఖ్యంగా పాకాల ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకురావడంలో ఆయన ప్రత్యేక చొరవ చూపారని, పాకాల ఆయకట్టు సాగునీటి ప్రయోజనాలు అందేలా కృషి చేశారని గుర్తుచేశారు.
అలాగే నర్సంపేట ప్రాంతానికి మెడికల్ కాలేజీ సాధించడంలో ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని సభలో వక్తలు కొనియాడారు. మెడికల్ కాలేజీ కోసం ప్రభుత్వ స్థాయిలో నిరంతరం కృషి చేసి, నిర్మాణం పూర్తయ్యే వరకు పట్టుదలతో పనిచేశారని పలువురు నాయకులు గుర్తుచేశారు.
పదవిలో ఉన్న కాలం కంటే ప్రజల కోసం చేసిన సేవలే నాయకుడి గొప్పతనాన్ని నిర్ణయిస్తాయి. పెద్ది సుదర్శన్రెడ్డి గారు చేసిన ప్రజాసేవ ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపింది. అని పలువురు పేర్కొన్నారు.
పాకాల ప్రాంతంలో పారే ప్రతి నీటి బొట్టులో, నర్సంపేట మెడికల్ కాలేజీలో చదివే ప్రతి విద్యార్థి భవిష్యత్తులోనూ పెద్ది సుదర్శన్రెడ్డి గారి సేవలను గుర్తు చేసుకునేలా ఆయన కృషి నిలిచిపోతుందని సభలో నివాళులు అర్పించారు.
అనంతరం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్& జిల్లా జనరల్ సెక్రెటరీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ మాడ్రాజు వెంకన్న మండల బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు కోరే సుధాకర్ మండల బీఆర్ఎస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరే రాము గ్రామపార్టీ ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల సత్యం సీనియర్ నాయకులు కత్తల వెంకన్న సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తోట రవి చెంచాల కృష్ణ కోడిమల సురేష్ తాళ్ల సంతోష్ జిలకల అశోక్ కర్రె రమేష్ నాగినేని వెంకన్న కొలుగూరి దేవేందర్ కూస కుమార్ పొన్నాల ఎల్లయ్య నాగేల్లి తిరుమలి భూష అశోక్ యాదవ్ ఇంతల యాదయ్య అడ్డూరి మోహన్ రావు తొర్రూరు సంజీవ పెండ్లి జన్నయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



