నర్సంపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా నర్సంపేట అంగడి సెంటర్లోని మద్దికాయల ఓంకార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో అమరవీరులకు నివాళులర్పించారు. పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కన్నం వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు, వంగల రాగసుధ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీరోచిత పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య, షేక్ బందగీలతో పాటు 4 వేల మంది అమరుల త్యాగాల వల్ల 3 వేల గ్రామాలు విముక్తి పొంది, 10 లక్షల ఎకరాల భూపంపిణీ జరిగిందన్నారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా ‘విలీన దినోత్సవం’గా నిర్వహించాలని, రాజధానిలో సాయుధ పోరాట అమరవీరుల భవన నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, డివిజన్ నాయకులు బత్తిని కుమారస్వామి, అనుమాల రమేష్, కర్నే సాంబయ్య, జన్ను రమేష్, నాగేల్లి భాస్కర్, గుణిపాక బిందు తదితరులు పాల్గొన్నారు.

సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం: ఎంసీపీఐ(యు) నాయకులు
నర్సంపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా నర్సంపేట అంగడి సెంటర్లోని మద్దికాయల ఓంకార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో అమరవీరులకు నివాళులర్పించారు. పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కన్నం వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు, వంగల రాగసుధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీరోచిత పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య, షేక్ బందగీలతో పాటు 4 వేల మంది అమరుల త్యాగాల వల్ల 3 వేల గ్రామాలు విముక్తి పొంది, 10 లక్షల ఎకరాల భూపంపిణీ జరిగిందన్నారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా ‘విలీన దినోత్సవం’గా నిర్వహించాలని, రాజధానిలో సాయుధ పోరాట అమరవీరుల భవన నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, డివిజన్ నాయకులు బత్తిని కుమారస్వామి, అనుమాల రమేష్, కర్నే సాంబయ్య, జన్ను రమేష్, నాగేల్లి భాస్కర్, గుణిపాక బిందు తదితరులు పాల్గొన్నారు.

