Sunday, 13 September 2026
  • Home  
  • చీకటి గోపి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి: మాల ఉద్యోగుల సంఘం
- ప్రకాశం

చీకటి గోపి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి: మాల ఉద్యోగుల సంఘం

తాడికొండ నియోజకవర్గం పొనికల్లు గ్రామంలో పోలీస్‌ కస్టడీలో మృతి చెందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకటి గోపి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేయకపోతే దళితులు ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. గోపి మృతదేహానికి నివాళులర్పించిన అశోక్‌బాబు, కుటుంబానికి అండగా నిలబడతామని తెలిపారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం నాయకులు జెర్రిపోతుల చిరంజీవి, మాలల జేఏసీ నాయకులు టి.క్రాంతికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు గడతోటి బ్రహ్మయ్య, దారా దుర్గాప్రసాద్ తదితర మాల జేఏసీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

తాడికొండ నియోజకవర్గం పొనికల్లు గ్రామంలో పోలీస్‌ కస్టడీలో మృతి చెందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకటి గోపి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేయకపోతే దళితులు ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. గోపి మృతదేహానికి నివాళులర్పించిన అశోక్‌బాబు, కుటుంబానికి అండగా నిలబడతామని తెలిపారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం నాయకులు జెర్రిపోతుల చిరంజీవి, మాలల జేఏసీ నాయకులు టి.క్రాంతికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు గడతోటి బ్రహ్మయ్య, దారా దుర్గాప్రసాద్ తదితర మాల జేఏసీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.