ఎస్సై బి రాఘవేంద్ర
రాబోయే వినాయక చవితి పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య, ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీస్ శాఖ కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలు, పుత్తూరు డీఎస్పీ, పుత్తూరు రూరల్ సీఐ సూచనలు మరియు ఎస్సై బి రాఘవేంద్ర వారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పండుగ నిర్వాహకులు, ప్రజలు పాటించాల్సిన విధివిధానాలను ఆయన స్పష్టంగా వివరించారు .
✅ వినాయక చవితి నాడు ప్రశాంతత వాతావరణమే లక్ష్యం
✅ వినాయక మండపాలకు ఆన్లైన్ అనుమతి తప్పనిసరి.
✅వినాయక మండపాల అనుమతులకు ఈ-పోర్టల్ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహ కులకు ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేసేందుకు సింగిల్ విండో ఈ-పోర్టల్ www.ganeshutsav.net ను ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అందుబాటులోకి తీసుకొ చ్చింది.
✅వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగ కుండా అనుమతులన్నీ ఈ పోర్టల్ ద్వారా సులువుగా పొందొచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
✅ ప్రతి మండపానికి ఐదుగురు ఆర్గనైజర్లు తప్పనిసరి.. బాధ్యత వారిదే
✅ డీజేలకు నో పర్మిషన్.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక*🦯🚓
✅ మద్యం సేవించి వాహనాలు నడిపితే సీజ్.. వినాయక నిమజ్జనంపై పోలీసుల కఠిన నిబంధనలు
✅మండపాల వద్ద మత్తు పదార్థాలు, జూదాలకు పూర్తిగా నిషేధం ..
✅ కరెంటు తీగలు లేని చోట మండపాలు ఏర్పాటు చేసుకోవాలి..
✅షార్ట్సర్క్యూట్, అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి.. మండప నిర్వాహకులకు సూచనలు..
✅రోడ్లకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు.. హెచ్చరిక
✅లోతైన చెరువులు, గుంటల్లో నిమజ్జనాలకు, పిల్లలు ముసలి వాళ్లు దూరంగా ఉండాలి* ..
✅భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నిర్వహణే పోలీసుల లక్ష్యం
———————
✍️మహ్మద్ షఫివుల్లా
పున్నమి దినపత్రిక
సత్యవేడు నియోజక వర్గం
ఇంచార్జ్

