గోపాలపురం నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు: పేదల గుండెల్లో నిలిచిన మహోన్నత నేత వైఎస్ఆర్!
గోపాలపురం నియోజకవర్గం:
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాల వద్ద పూలమాలలు వేసి, కేకులు కట్ చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని పలు చోట్ల మాజీ హోంమంత్రి, రాష్ట్ర వైఎస్ఆర్సిపి క్రమశిక్షణ కమిటీ మెంబర్ మరియు వైఎస్ఆర్సిపి గోపాలపురం నియోజకవర్గ ఇంచార్జ్ అయిన తానేటి వనితమ్మ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ వేడుకల కొనసాగింపుగా రాజంపాలెం గ్రామంలో వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షుడు కురుకూరి నాగేశ్వరరావు గారు మరియు కురుకూరి ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాజంపాలెంలో కేక్ కట్ చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షుడు కురుకూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, కోట్లాది మంది పేదల గుండె చప్పుడు అని కొనియాడారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి విప్లవాత్మక పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో ఆయన చిరునవ్వులు పూయించారని గుర్తుచేశారు. ఆయన చూపిన బాటలోనే నేటి తరం నాయకత్వం కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, వైఎస్ఆర్ అందించిన మహోన్నత పాలన తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుందని ఆయన ప్రసంగించారు.
ఈ ఘనమైన కార్యక్రమంలో కురుకూరి నాగేశ్వరరావు, కురుకూరి ధనలక్ష్మి, గంగాధరుని సత్యనారాయణ, గంగుల వెంకటరావు, నీలపాల సత్యనారాయణ, షేక్ ఇబ్రహీం, గుండారపు శ్రీను, ఏలూరి వెంకటేశు, బైపో కిరణ్ కుమార్, ఆడ్రు రామారావు, బంగారు రాజు, కాసాని శ్రీను, గాలింకి సుబ్బారావు, పోలేపల్లి కృష్ణ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.



