చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో ఖమ్మంలో బీజేపీ నాయకులపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు సీనియర్ నాయకులు మండదపు సుబ్బారావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు RVS యాదవ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బండ్ల రిగన్ ప్రతాప్, గడీల నరేష్, వీరవెల్లి రాజేష్ గుప్తా, కందుల శ్రీ కృష్ణ, రుద్రగాని మాధవ్, బోయినపల్లి సురేష్లను కూడా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా నేతలను నిర్బంధించడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు.



