ప్రతి గ్రామంలో పున్నమి రిపోర్టర్ లక్ష్యం
కొడవలూరు: పున్నమి తెలుగు దినపత్రిక కొడవలూరు రిపోర్టర్ జక్కా మహేష్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు నుంచి పున్నమి రిపోర్టర్లను చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
మండల ఇంచార్జ్లు, నియోజకవర్గ ఇంచార్జ్లతో సమన్వయం చేసుకుంటూ సంస్థను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. సమష్టి సహకారంతో పున్నమి తెలుగు దినపత్రికను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో నెల్లూరు జిల్లా రిపోర్టర్గా ఎదిగి, మరింత బాధ్యతతో ప్రజలకు సేవలందించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.


