నెల్లూరులోని కిమ్స్ కడిల్స్ ఆసుపత్రి వైద్యులు కేవలం 29 వారాల 6 రోజులకు జన్మించిన ఒక ప్రీటర్మ్ మగ శిశువుకు అత్యాధునిక వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడారు. నగరానికి చెందిన షేక్ సోని అనే గర్భిణీ ఉమ్మనీరు లీక్ అవ్వడంతో అత్యవసరంగా ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు అత్యవసర LSCS సర్జరీ ద్వారా ప్రసవం చేశారు.
పుట్టిన సమయంలో ఆ బాబు బరువు కేవలం 1250 గ్రాములు మాత్రమే ఉంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆ శిశువును వెంటనే NICU లో ఉంచి అత్యాధునిక వెంటిలేటర్ సపోర్ట్తో చికిత్స అందించారు. డాక్టర్ నవీన్, డాక్టర్ భార్గవ్, డాక్టర్ మురార్జీల ఆధ్వర్యంలోని నిపుణులైన వైద్య బృందం ఎంతో క్లిష్టమైన ఈ కేసును విజయవంతంగా పూర్తి చేసి, శిశువు ఆరోగ్యంగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేశారు.


